Monday, 2 November 2015

అన్నవరం ప్రయాణం :

అన్నవరం 
ఇది ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లోని 
తూర్పు గోదావరి జిల్లాలో 
శంఖవరం మండలానికి చెందిన గ్రామంలో ,
పంపా నది సమీపంలో ''రత్నగిరి '' అనుకొండపై 
''శ్రీ వీర వెంకట సత్యన్నారాయణ స్వామి '' కొలువై ఉన్న దివ్యక్షేత్రం ,
తప్పక చూడవలసిన సుందర ప్రదేశం కూడా . 
ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది 
అయితే కార్తీకమాసంలో ఇంకా ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు . 
ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చొని ఒకేసారి సత్యన్నారాయణ స్వామీ వ్రతాన్ని కనుల పండుగ గా చేసుకుంటూ ఉండటం ఇక్కడ ప్రత్యేకత 

ఇక్కడికి నేను వెళ్ళటం రెండవసారి అయితే అంతకు ముందు ఎప్పుడూ లేనిది ఈ సారి ఎందుకో చాలా తృప్తిగా అనిపించింది . కలిసిన ప్రతి వ్యక్తిలో ఒక మంచి సహకారం లబించింది . రైలు దిగిన దగ్గర నుంచి తిరిగి మేము భాగ్యనగరం రైలు ఎక్కేంత వరకు ఎంతో ఆతిద్యాన్ని ,ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని అందుకుంటూనే ఉన్నాము . ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తినుంచి దొరికినంతవరకు దండుకుందాం అని ఒక ఆటోవాలా నుంచి గాని , ఆలయ సిబ్బంది నుంచి గాని ,అక్కడ పని చేసే పూజారుల నుంచి కాని కనపడలేదు . అప్పుడు అనిపించింది ఇది చిన్న చిన్న మద్య తరగతి కుటుంభాల నుంచి పెద్ద పెద్ద ధనికుల వరకైనా ఎంతో సౌలభ్యమైనదని . దగ్గరుండి చాలా ఓపికగా పూజను చేయించే పూజారులు ,అటు లైన్లో గంటల తరబడి నుంచుంటూ భక్తులకు సహాయపడే సిబ్బంది చాలా చక్కగా చూడ ముచ్చటగా అనిపించింది ఎందుకంటే అంతరాలయ దర్శనం అని లోపలి వెళ్ళిన మేము అక్కడ దర్శనం సంతృప్తి నివ్వకపోతే సిబ్బంది పిలిచి మరీ ,మరోసారి దర్శన బాగ్యాన్ని కలిగించిన తీరు ప్రశంసనీయం . అక్కడి వాతావరణమేమో ,ప్రతీ వారి నుంచి ఎంతో మర్యాద ,చక్కటి భాష ,మనకు తెలియనివి ఓపికగా మనకు తెలియ చెప్పే నేర్పు అలా వీరికి మాత్రమే సాధ్యం అన్నట్టు ఉంది . అంతరాలయ దర్శనం లో ఆ స్వామిని చూస్తే అలా చూస్తూనే ఉండాలి అనిపించింది . అలా కిందకు వచ్చి స్వామి వారి యంత్రాలయం (ఆయన పాదములు ఉన్న ప్రదేశం ) ,అక్కడి పవిత్రమైన గోధుమ నూకతో చేసే ప్రసాదం అమృతనీయం . కొన్ని గంటలు ఆ ప్రదేశం లో ఉంటే ఏదో మనసులో ఒక ప్రశాంతత , నిర్మలత్వం అడుగడుగునా ఉప్పొంగుతున్న భక్తి భావం . అక్కడి పూజారులు చెప్పే స్వామి వారి వృత్తాంతం ,మహిమలు చెప్తుంటే మారు మారు మారో మారు ఇక్కడికి రావాలనే మనో సంకల్పం కలుగుతూ ఉంటుంది . 





No comments:

Post a Comment